ఇదిలా ఉంటే, రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘వారణాసి’ గురించి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఫిల్మీ ఫోకస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ చిత్రంలో రాముడు, కుంభకర్ణుడి మధ్య సుమారు 30 నిమిషాల పాటు సాగే భారీ యుద్ధ సన్నివేశం ఉంటుందని వెల్లడించారు.

