వర్షాకాలం ప్రారంభం కాగానే ఇంటి పరిశుభ్రత, నిర్వహణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో గోడలు తడిసిపోవడం, ఇంట్లో తేమ పెరగడం మాత్రమే కాదు.. చెక్కతో తయారైన తలుపులు, కిటికీలు, అల్మారాలు, ఫర్నిచర్కు చెదలు పట్టే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒకసారి చెదలు పట్టడం ప్రారంభమైతే, అవి చెక్కను లోపలి నుంచి నెమ్మదిగా దెబ్బతీస్తూ భారీ నష్టాన్ని కలిగిస్తాయని ఉత్తర ప్రదేశ్ అజంగఢ్కు చెందిన వడ్రంగి శివశరణ్ తెలిపారు.

