చర్మంలోని మలినాలను తొలగించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల ముఖం మరింత కాంతివంతంగా, మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. అయితే ముఖానికి ఆవిరి పట్టేటప్పుడు జాగ్రత్తలు కూడా అవసరం. అధిక వేడి ఆవిరిని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే, 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే ఈ సులభమైన చిట్కాను మీ రోజువారీ సంరక్షణలో భాగం చేసుకోవచ్చు.

