తెలంగాణ ప్రభుత్వానికి ఒక విషయం బాగా అర్థమైంది. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు బాగా జరుగుతున్నాయి. తాము ఖరీదైన సన్న బియ్యాన్ని ప్రజలకు ఇస్తుంటే.. ఆ బియ్యం చాలా వరకూ.. పేదలకు చేరట్లేదు. కొంతమంది రేషన్ డీలర్లు, మధ్యవర్తులు, అక్రమార్కులూ.. కలిసి.. బియ్యాన్ని పక్కదారి పట్టించి, మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. మరి దీనికి బ్రేక్ వెయ్యడం ఎలా అని ఆలోచించిన ప్రభుత్వం.. ఓ ప్లాన్ చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులను తయారుచేసి, ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది.

