వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు గోపన్నగారి చందు మాట్లాడుతూ.. స్కాంద మహాపురాణం ప్రకారం ప్రదోష కాల శివారాధనకు ఉన్న విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఉదయం పూట శివుడుని దర్శించుకుంటే ముందు రోజు చేసిన పాపాలు, మధ్యాహ్న కాలంలో దర్శిస్తే ఒక జన్మ పాపం నశిస్తాయన్నారు. ఇక సాయంకాలమైన ప్రదోష కాలంలో ఒక్కసారి స్వామిని ఆరాధిస్తే, ఏకంగా 33 కోట్ల మంది దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని స్పష్టం చేశారు. రోజంతా ఉపవాసముండి, సాయంత్రం వేళ స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తే ఏడు జన్మల పాపాలు సైతం పటాపంచలవుతాయని అర్చకస్వాములు చెప్పారు.
Source link
