Last Updated:
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఉగ్రవాదం, వేర్పాటువాదాల నిర్మూలనతో పాటు ఆసియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ చర్చలు జరపనున్నారు.
ఆసియా దేశాలతో వ్యూహాత్మక, వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మక షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ (కిర్గిజిస్తాన్) దేశాలకు బయల్దేరారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రశాంతమైన ఆసియా ప్రాంత నిర్మాణమే లక్ష్యంగా తోటి దేశాలతో కలిసి పనిచేస్తామని పర్యటనకు ముందు మోదీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

