Last Updated:
Jio 10 years: భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన జియో తన ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 2016లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన రిలయన్స్ జియో తొలి దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దశాబ్ది వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణలోనూ జియో ఉద్యోగులు, నాయకులు, భాగస్వాముల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గత పదేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో 5G, కనెక్టెడ్ హోమ్స్, డిజిటల్ ఎంటర్ప్రైజెస్ వంటి రంగాల్లో రాబోయే అవకాశాలపై దృష్టి సారించారు.
భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో గణనీయమైన మార్పులకు దారితీసిన జియో తన ప్రస్థానంలో కీలక మైలురాయిని చేరుకుంది. 2016లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన జియో.. తన ప్రయాణంలో తొలి దశాబ్దాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. ఈ పదేళ్ల కాలంలో డిజిటల్ కనెక్టివిటీ విస్తరించడంతో పాటు, లక్షలాది మంది భారతీయులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ పేర్కొంది.

