వర్షాకాలంలో జలుబు, జ్వరం, విరేచనాలు, టైఫాయిడ్, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఇంట్లో ఉపయోగించే నీటి నాణ్యతపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు మెరిసిపోతూ కనిపించే వాటర్ ట్యాంక్లోపల బ్యాక్టీరియా, నాచు, మురికి పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని, కలుషితమైన నీరు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని విశాఖపట్నంలోని గాయత్రి హాస్పిటల్ సీనియర్ వైద్యులు జనరల్ ఫిజీషియన్ కె.వి.రామ్ కుమార్ తెలిపారు. అందుకే వర్షాకాలంలో వాటర్ ట్యాంక్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

