ప్రభన్యూస్

Gold Price Today: గోల్డ్, సిల్వర్ కొనేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు | బిజినెస్


Last Updated:

Gold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం.

News18
News18

బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ కమోడిటీ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు ఎగబాకుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం.

ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ విడుదల చేసిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్‌కు చెందిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,670 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.755 మేర పెరుగుదల నమోదైంది. దీంతో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు వరుసగా బలమైన లాభాలతో కొనసాగుతున్నాయి.

వెండి ధరలు కూడా ఇదే బాటలో దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో ఎంసీఎక్స్ వెండి ధర కిలోకు రూ.2,19,275 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే కిలోకు రూ.2,529 మేర పెరుగుదల నమోదైంది. వెండి ధరల్లో ఒకేరోజు ఇంత భారీ పెరుగుదల నమోదు కావడం మార్కెట్‌లో బలమైన కొనుగోళ్లకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in విడుదల చేసిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా ధరల ప్రకారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.620 పెరిగి రూ.1,43,590 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,620కు చేరుకుంది. దీంతో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై ధరల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.

అటు స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.2,680 పెరిగి ప్రస్తుతం రూ.2,19,830 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి రెండింటి ధరలు ఒకేసారి పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు తాజా ధరలపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకపు విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునే వారు తాజా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 9:23 am Digital Edition : Prabhanews
Gold Price Today: గోల్డ్, సిల్వర్ కొనేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు | బిజినెస్

Last Updated:Aug 04, 2026 9:09 AM ISTGold Rate Today: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా.. తగ్గాయో తెలుసా? దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో, మరోవైపు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకేసారి తెలుసుకుందాం.
News18బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ కమోడిటీ మార్కెట్‌లోనూ విలువైన లోహాల ధరలు ఎగబాకుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌తో పాటు స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం.ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ విడుదల చేసిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్‌కు చెందిన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,670 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.755 మేర పెరుగుదల నమోదైంది. దీంతో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు వరుసగా బలమైన లాభాలతో కొనసాగుతున్నాయి.వెండి ధరలు కూడా ఇదే బాటలో దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో ఎంసీఎక్స్ వెండి ధర కిలోకు రూ.2,19,275 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే కిలోకు రూ.2,529 మేర పెరుగుదల నమోదైంది. వెండి ధరల్లో ఒకేరోజు ఇంత భారీ పెరుగుదల నమోదు కావడం మార్కెట్‌లో బలమైన కొనుగోళ్లకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in విడుదల చేసిన హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా ధరల ప్రకారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.620 పెరిగి రూ.1,43,590 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,620కు చేరుకుంది. దీంతో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై ధరల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.అటు స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.2,680 పెరిగి ప్రస్తుతం రూ.2,19,830 వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి రెండింటి ధరలు ఒకేసారి పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు తాజా ధరలపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మారకపు విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునే వారు తాజా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link