ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేలపై ప్రయాణించే ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందుకోసం రాజ్మార్గ్యాత్ర మొబైల్ యాప్ తాజా వెర్షన్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్కు సంబంధించిన స్పష్టమైన జియో-ట్యాగ్డ్, టైమ్స్టాంప్ ఉన్న ఫొటోను అప్లోడ్ చేయాలి. పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను కూడా ఇవ్వాలి. సమర్పించిన ఫొటో, వివరాలను ముందుగా ఏఐ సాయంతో స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత మాన్యువల్గా కూడా చెక్ చేస్తారు. వివరాలు సరైనవిగా ఉండి నిబంధనలకు అర్హత ఉంటే, ఇచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్కు అనుసంధానమైన ఫాస్ట్ట్యాగ్లో రూ.1,000 క్రెడిట్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
