ప్రతి పెట్రోల్ బంక్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఈ10, ఈ20 మూడు రకాల ఇంధనాలను ఒకేసారి నిల్వ చేయాలని నిబంధన పెడితే భారీ లాజిస్టిక్స్ సమస్యలు వస్తాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గత నెలలో పలుమార్లు చెప్పింది. భారత్లో లక్షకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటికి రిఫైనరీలు, టెర్మినల్స్, డిపోలు, పైప్లైన్లతో కూడిన పెద్ద పంపిణీ నెట్వర్క్ మద్దతుగా ఉంది. ఈ నెట్వర్క్ అంతటా ఒకేసారి పలు రకాల బేస్ పెట్రోల్ను నిల్వ చేసి నిర్వహించాల్సి వస్తే ఖర్చులు పెరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్వెంటరీ నిర్వహణ కూడా క్లిష్టమవుతుందని, మొత్తం ఆపరేషనల్ సామర్థ్యం తగ్గుతుందని పేర్కొంది. (image: AI Generated)
