Last Updated:
దేశంలోని విద్యావ్యవస్థపై మరో బాంబ్ విసిరారు రామ్ గోపాల్ వర్మ. నేడు (సెప్టెంబర్ 5) టీచర్స్ డే సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.
ఉపాధ్యాయ దినోత్సవం అనగానే అందరూ తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ, శుభాకాంక్షలు చెబుతారు. కానీ, నిత్యం తనదైన శైలిలో భిన్నమైన వాదనలు వినిపించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విద్యావ్యవస్థపై, ఉపాధ్యాయుల బోధనా విధానంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు ‘హ్యాపీ టీచర్స్ డే’ అనే పదం వినడం ఏమాత్రం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు.

