Last Updated:
Brics Summit 2026: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శనివారం కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఈ సమావేశానికి సంబంధించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా భారత్-చైనా సంబంధాలు భిన్నమైన వైరుధ్యాల నడుమ కొనసాగుతున్నాయి. ఆసియాలోని ఈ రెండు అగ్రరాజ్యాలకు పరస్పర అవసరాలు ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక విశ్వాసం మాత్రం పరిమితంగానే ఉంటూ వస్తోంది. 2020 నాటి గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య నెమ్మదిగా మొదలైన సయోధ్య ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లగలమా లేదా అన్నది అంచనా వేసేందుకు, న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సదస్సు మోదీ-జిన్పింగ్లకు కీలక అవకాశాన్ని కల్పించనుంది.

