దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు.

