హైదరాబాద్, విజయవాడ, విశాఖ.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉందా? లేక.. సర్ ప్రక్రియ తర్వాత ఓటు కోల్పోతారా? ఇది కేవలం ప్రశ్న కాదు, 2026 ఎన్నికల ముందు ప్రతి ఓటర్ ఎదుర్కొంటున్న నిజమైన సవాలు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2026 ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లక్షల మంది ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ ఓటు నిజమైనదేననీ, తమకు ఓటు హక్కు ఉంది అని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

