Last Updated:
Chennai: తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 16 ఏళ్ల బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు.
అతడి కడుపులో భారీ సంఖ్యలో ప్రమాదకరమైన లోహపు వస్తువులు ఉన్నట్లు గుర్తించి, అత్యవసర శస్త్రచికిత్స ద్వారా వాటన్నింటినీ సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఈ అరుదైన మరియు విస్మయపరిచే ఘటన చోటుచేసుకుంది.

