Last Updated:
Upcoming IPOs 2026: స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నా ఐపీఓలపై ఇన్వెస్టర్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలో ఏకంగా 7 కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలతో మదుపరుల ముందుకు రానున్నాయి. వీటి ద్వారా మొత్తం రూ.1,415 కోట్ల వరకు నిధులు సమీకరించనున్నారు.
గత నెల రోజులుగా సెకండరీ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, ఏకీకరణ (కన్సాలిడేషన్) కొనసాగుతున్నప్పటికీ, ప్రైమరీ మార్కెట్పై మదుపరులకు ఉన్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదు. దలాల్ స్ట్రీట్లో పెట్టుబడుల పండుగ ఇంకా ఉత్సాహంగా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 31తో ప్రారంభమయ్యే రాబోయే వారంలో స్టాక్ మార్కెట్ మరింత కోలాహలంగా మారనుంది. ఈ ఒక్క వారంలోనే మొత్తం రూ. 1,415 కోట్ల విలువైన ఏడు కొత్త పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) మదుపరుల ముందుకు రానుండగా, అదే సమయంలో ఏకంగా 14 కొత్త కంపెనీలు స్టాక్ మార్కెట్లలో తమ ట్రేడింగ్ను ప్రారంభించి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

