Last Updated:
భారతదేశం ‘వన్ నేషన్, వన్ టైమ్’ (ఒకే దేశం, ఒకే సమయం) దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలనా, వాణిజ్య మరియు ఇతర అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఇకపై ఒకే సూచనగా ‘భారతీయ ప్రామాణిక సమయం’ (Indian Standard Time – IST) ను వినియోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
భారతదేశం ‘వన్ నేషన్, వన్ టైమ్’ (ఒకే దేశం, ఒకే సమయం) దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా చట్టపరమైన, పరిపాలనా, వాణిజ్య మరియు ఇతర అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఇకపై ఒకే సూచనగా ‘భారతీయ ప్రామాణిక సమయం’ (Indian Standard Time – IST) ను వినియోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ‘లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2026’ నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ద్వారా దేశంలోని ప్రతి అధికారిక మరియు వాణిజ్య కార్యకలాపం ఎటువంచి వ్యత్యాసాలు లేకుండా ఒకే ఖచ్చితమైన సమయ ప్రమాణంపై నడుస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

