పాత బంగారం విక్రయాలు పెరగడంతో దేశంలో గోల్డ్ రీసైక్లింగ్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాకర్లలో ఉపయోగించకుండా ఉన్న పాత ఆభరణాలను ప్రజలు విక్రయిస్తుండగా, వాటిని కరిగించి మళ్లీ కొత్త నగల తయారీలో వినియోగిస్తున్నారు. దీంతో రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా గణనీయమైన లాభం చేకూరుతోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థకు చెందిన 100కు పైగా గోల్డ్ పాయింట్లలో పాత బంగారం కొనుగోళ్లు సుమారు 40 శాతం పెరిగాయి. సంస్థ సీఈఓ కేయూర్ షా మాట్లాడుతూ, విశ్వసనీయమైన, పారదర్శక విధానాల ద్వారా పాత బంగారాన్ని విక్రయించడానికి ప్రజలు ఇప్పుడు మరింత ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

