ఆర్బీఐ సమాచారం ప్రకారం, పాలిమర్ బ్యాంక్నోట్లు కాగితపు నోట్లతో పాటు మాత్రమే విడుదల చేయాలని ప్రతిపాదించారని, కాగితపు కరెన్సీని పూర్తిగా తొలగించి దాని స్థానంలో పాలిమర్ నోట్లు తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు. మరో లిఖితపూర్వక సమాధానంలో పంకజ్ చౌధరీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0 గురించి వివరాలు వెల్లడించారు. 2026 జూలై 21 నాటికి ఈ పథకం కింద లబ్ధిదారులైన సంస్థలకు మొత్తం 5,17,657 గ్యారంటీలు జారీ చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం గ్యారంటీ విలువ రూ.1,90,523.78 కోట్లుగా ఉందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

