ప్రభన్యూస్

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలో 7 రోజుల వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Andhra Pradesh Rains. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.

+

News18

News18

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు చురుకుగా మారనున్నాయి. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతంలో కొనసాగుతోందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై స్పష్టంగా కనిపించనుందని వివరించారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న 24 గంటల్లో ఒడిశాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో, అలాగే ఉత్తర కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశముండగా, ఆ తర్వాత కూడా ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

మత్స్యకారులకు కూడా కీలక హెచ్చరిక జారీ చేశారు. సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒడిశా తీరం వైపు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వర్షాల పరిస్థితిపై అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలను పాటించడం మంచిదని అధికారులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:59 am Digital Edition : Prabhanews
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలో 7 రోజుల వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Andhra Pradesh Rains. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jul 17, 2026 10:15 PM ISTఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు, 40-50 కి.మీ వేగంతో గాలులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు.+
News18వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు చురుకుగా మారనున్నాయి. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతంలో కొనసాగుతోందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై స్పష్టంగా కనిపించనుందని వివరించారు.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న 24 గంటల్లో ఒడిశాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో, అలాగే ఉత్తర కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశముండగా, ఆ తర్వాత కూడా ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.మత్స్యకారులకు కూడా కీలక హెచ్చరిక జారీ చేశారు. సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒడిశా తీరం వైపు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వర్షాల పరిస్థితిపై అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలను పాటించడం మంచిదని అధికారులు పేర్కొన్నారు.Location :Visakhapatnam,Andhra PradeshFirst Published :Jul 17, 2026 10:15 PM ISTమరింత చదవండి

Source link