ప్రభన్యూస్

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మాజీ సర్పంచ్ భర్త.. కరీంనగర్‌లో కలకలం! | తెలంగాణ వార్తలు


Last Updated:

కరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

+

News18

News18

కరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలతో ఉన్న రాజేందర్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కేపీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. శరీరంలోని అధిక భాగం కాలిపోవడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితుడి భార్య, మాజీ సర్పంచ్ సమత తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామంలోని స్థానిక సమస్యలు, అక్రమాలపై ప్రశ్నించినందుకే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడిగా పేర్కొన్న మురళీధర్ రెడ్డి తమ భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, ఆ కేసు కారణంగా రాజేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మీడియా ఎదుట పేర్కొన్నారు.

అంతేకాకుండా.. తమ దుకాణం సమీపానికి వచ్చిన కొందరు వ్యక్తులను “ఎవరు మీరు, ఎందుకు వచ్చారు?” అని తన భర్త ప్రశ్నించగా, “మురళీధర్ రెడ్డి పంపించారు” అని వారు చెప్పినట్లు తన భర్త వెల్లడించాడని సమత ఆరోపించారు. తమపై జరుగుతున్న వేధింపులు, ఒత్తిళ్లు భరించలేకపోయిన రాజేందర్ రెడ్డి చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే తమకు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా ఆయన నివాసం ఎదుటే తాను కూడా ఆత్మాహుతికి సిద్ధమవుతానని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుటే ఈ ఘటన జరగడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లేదా ఆయన కార్యాలయం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? బాధిత కుటుంబం చేసిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర సంచలనం రేపగా.. స్థానిక ప్రజలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 4:39 pm Digital Edition : Prabhanews
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మాజీ సర్పంచ్ భర్త.. కరీంనగర్‌లో కలకలం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 2:19 PM ISTకరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.+
News18కరీంనగర్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలతో ఉన్న రాజేందర్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కేపీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. శరీరంలోని అధిక భాగం కాలిపోవడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై బాధితుడి భార్య, మాజీ సర్పంచ్ సమత తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామంలోని స్థానిక సమస్యలు, అక్రమాలపై ప్రశ్నించినందుకే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడిగా పేర్కొన్న మురళీధర్ రెడ్డి తమ భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, ఆ కేసు కారణంగా రాజేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మీడియా ఎదుట పేర్కొన్నారు.అంతేకాకుండా.. తమ దుకాణం సమీపానికి వచ్చిన కొందరు వ్యక్తులను "ఎవరు మీరు, ఎందుకు వచ్చారు?" అని తన భర్త ప్రశ్నించగా, "మురళీధర్ రెడ్డి పంపించారు" అని వారు చెప్పినట్లు తన భర్త వెల్లడించాడని సమత ఆరోపించారు. తమపై జరుగుతున్న వేధింపులు, ఒత్తిళ్లు భరించలేకపోయిన రాజేందర్ రెడ్డి చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.ఈ ఘటనకు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే తమకు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా ఆయన నివాసం ఎదుటే తాను కూడా ఆత్మాహుతికి సిద్ధమవుతానని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుటే ఈ ఘటన జరగడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లేదా ఆయన కార్యాలయం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? బాధిత కుటుంబం చేసిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర సంచలనం రేపగా.. స్థానిక ప్రజలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link