విస్తృతంగా తనిఖీలు..: పోలీసులు ఇప్పటికే నగర వ్యాప్తంగా జల్లడ పడుతున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రెసిడెన్షియల్ కాలనీలు, అపార్ట్మెంట్లు, లాడ్జీలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అద్దె ఇళ్లే కేంద్రంగా డ్రగ్స్ సరఫరా, జూదం, వ్యభిచారం, సైబర్ మోసాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, అనుమానితులు నివాస ప్రాంతాల్లో తలదాచుకోకుండా నిరోధించేందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

