వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం వ్యవసాయ అధికారి భాస్కర్ ప్రకారం.. ఇంకా రైతులు ఇందులో నమోదు చేసుకోకపోతే.. దగ్గరిలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి పని పూర్తి చేసుకోవాలని సూచించారు. దీని వల్ల రైతు స్కీమ్స్ ప్రయోజనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందొచ్చని వివరిచారు. రైతులకు కేటాయించే 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే పంటల బీమా, పీఎం కిసాన్ యోజన, పంట నష్ట పరిహారం, అన్నదాత సుఖీభవ స్కీమ్స్తో పాటు వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు, ఎరువుల కొనుగోలు, వివిధ రకాల పంటల మద్దతు ధరలు పొందడానికి అర్హులు కారని వివరించారు. ఈ ప్రయోజనాలన్నీ కోల్పోకుండా ఉండాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డ్, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, పొలం పాస్ బుక్ తీసుకుని సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఏపీలో రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.6 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.14 వేలు మొత్తంగా ఏడాదికి రూ.20 వేలు లభిస్తున్నాయి.

