కాయిర్ భారత్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్న సహజ ఫైబర్లలో ఒకటి. దేశంలో కాయిర్ను వ్యవస్థీకృతంగా ఉత్పత్తి చేయడం 1859లో కేరళలోని అలప్పుజలో తొలి కాయిర్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశంలోని ప్రధాన కొబ్బరి పండించే ప్రాంతాలకు ఈ రంగం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలో కాయిర్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. ప్రపంచ కాయిర్ ఫైబర్ ఉత్పత్తిలో 80 శాతానికి పైగా భారత్ వాటా ఉంది. ఈ పరిశ్రమ మహిళల ఉపాధితో కూడా బలంగా ముడిపడి ఉంది. ఫైబర్ తీసే పని, దారం వడికే పనుల్లో పాల్గొంటున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. అందుకే కాయిర్ రంగం గ్రామీణ ఉపాధికి చాలా ముఖ్యమైనది. ఇది కొబ్బరి రైతులు, కార్మికులు, మహిళా కళాకారులు, సహకార సంఘాలు, వ్యాపారులు, తయారీదారులు, ఎగుమతిదారులను ఒకే విలువ గొలుసుతో కలుపుతోంది. కాయిర్తో కేవలం ముడి ఫైబర్ మాత్రమే తయారు చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్, డిజైన్, కొత్త ఆలోచనలతో కాయిర్ను విలువ ఎక్కువగా ఉండే ఎన్నో ఉత్పత్తులుగా మార్చవచ్చు. ఇందులో మ్యాట్లు, డోర్ మ్యాట్లు, తాళ్లు, యార్న్, బ్రష్లు, ఇంట్లో ఉపయోగించే ఇతర వస్తువులు, అలంకరణ వస్తువులు, హస్తకళలు, తోటలు, హార్టికల్చర్కు ఉపయోగించే ఉత్పత్తులు, కొత్త రకాల పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ ఉత్పత్తులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

