Last Updated:
దేశంలో టోకు ధరల పెరుగుదల మరింత వేగం పుంజుకుంది. ఆగస్టు 2026లో హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) 9.92 శాతానికి చేరింది. జూలైలో నమోదైన 9.78 శాతంతో పోలిస్తే ఇది మరింత పెరిగింది. ముఖ్యంగా ఇంధనం, పెట్రోలియం, ఆహార ధరలు పెరగడం టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచింది. అసలు ఏ వస్తువుల ధరలు ఎంత పెరిగాయి? రానున్న రోజుల్లో సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? తెలుసుకుందాం.
భారతదేశంలో టోకు ధరలు ఆగస్టు 2026లో వేగంగా పెరిగాయి. ముఖ్యంగా చమురు, ఆహార ధరల్లో పెరుగుదల కారణంగా హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI Inflation) ఏడాది ప్రాతిపదికన 9.92 శాతానికి చేరింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూలైలో నమోదైన 9.78 శాతం పెరుగుదలతో పోలిస్తే ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. రాయిటర్స్ పోల్లో ఆర్థికవేత్తలు అంచనా వేసిన 9.89 శాతం కంటే కూడా తాజా గణాంకాలు స్వల్పంగా ఎక్కువగా ఉండటం గమనార్హం.

