Last Updated:
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంటీఎఫ్ ట్రేడింగ్పై 20 రోజులు వడ్డీ లేదని తెలిపింది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇన్వెస్టర్లు షేర్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు డబ్బు వినియోగాన్ని మరింత సౌకర్యంగా చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిమిటెడ్ ‘ఎంటీఎఫ్ టీ20’ పేరుతో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. దీని కింద అర్హత ఉన్న ఇన్వెస్టర్లకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) ద్వారా షేర్లు కొనుగోలు చేసినప్పుడు మొదటి 20 క్యాలెండర్ రోజుల పాటు 0 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఈ ఆఫర్ గురించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లీ మాట్లాడుతూ, “ఆర్థిక స్వాతంత్ర్యం అంటే అవకాశాలు అందుబాటులో ఉండటం మాత్రమే కాదు. వాటిని ఉపయోగించుకునే సౌలభ్యం కూడా ఉండాలి. ఎంటీఎఫ్ టీ20 ద్వారా మొదటి 20 రోజులకు వడ్డీ లేకుండా అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు తమ మూలధనాన్ని మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. ట్రేడింగ్ టూల్స్ను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా విలువను అందించడం పట్ల మా నిబద్ధతకు ఈ ఆఫర్ నిదర్శనం” అని చెప్పారు.

