ఈ సందర్భంగా ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రణయ్ రంజన్ ద్వివేది మాట్లాడుతూ, “నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.6 లక్షల కోట్లను దాటడం ఒక ముఖ్యమైన మైలురాయి. తమ రిటైర్మెంట్ భద్రత అనే కీలక ఆర్థిక లక్ష్యం కోసం మాపై నమ్మకం ఉంచిన 1.85 కోట్లకు పైగా సబ్స్క్రైబర్ల విశ్వాసానికి ఇది ప్రతిబింబం. ఏళ్లుగా ఈ పొదుపులను క్రమశిక్షణతో, జాగ్రత్తగా, దీర్ఘకాలిక పెట్టుబడి విధానంతో నిర్వహించేందుకు మేము కృషి చేస్తున్నాం. భారత రిటైర్మెంట్ రంగం మారుతున్న నేపథ్యంలో, మా పెట్టుబడి సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడం, అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను కొనసాగించడం, ఎక్కువ మంది భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళికపై అవగాహన కల్పించడం మా లక్ష్యం. తద్వారా మరింత మంది ఆర్థికంగా భద్రమైన భవిష్యత్తు కోసం సిద్ధం కావచ్చు” అని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

