Last Updated:
ప్యాక్ చేసిన ఆహారాలపై కొవ్వు, ఉప్పు, చక్కెర హెచ్చరిక లేబుల్స్ పెట్టాలనుకుంటున్నట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటే ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయో లేదో వినియోగదారులకు సులభంగా తెలిసేలా కొత్త హెచ్చరిక లేబుల్ తీసుకురావాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతిపాదించినట్టు పీటీఐ వెల్లడించింది. ప్యాక్ ముందు భాగంలో ఎరుపు రంగులో కనిపించేలా ఈ హెచ్చరికను పెట్టే ప్రతిపాదన గురించి సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ ప్రతిపాదన వివరాలను వెల్లడించింది. అదనంగా కలిపిన సాచ్యురేటెడ్ ఫ్యాట్, అదనపు చక్కెర, ఉప్పు వీటిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార ఉత్పత్తులకు ఈ హెచ్చరిక లేబుల్ పెట్టాలని ప్రతిపాదించింది.

