ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక |


Last Updated:

ట్రంప్ ఇరాన్‌కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం.

TRUMP (ANI)
TRUMP (ANI)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్‌కు అనుకూల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ట్రంప్ స్పష్టం చేశారు.

ANI తెలిపిన వివరాల ప్రకారం… మొదట అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక దాడికి సిద్ధమైందని, అయితే చివరి నిమిషంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతర్‌తో పాటు ఇరాన్ కూడా దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ఆ చర్యను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో దాడి జరిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని, అయితే పలు దేశాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని చర్చలకు మరో అవకాశం కల్పించామని చెప్పారు.

ఇరాన్ అభ్యర్థన మేరకే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ మద్దతు ఇస్తున్నాయని, మరికొన్ని దేశాలు కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చాయని తెలిపారు. అనేక గంటలపాటు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఇరాన్ మాత్రం చర్చలు జరగడం లేదని బహిరంగంగా చెబుతోందని ఆయన ఆరోపించారు.

అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమేనని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్వ ప్రభుత్వాలు, ఇతర దేశాలు విఫలమయ్యాయని, ఇప్పుడు దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.

ఇరాన్ అణు సామర్థ్యంపై అమెరికా గతంలో చేపట్టిన సైనిక చర్యలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఏడాదికిపైగా క్రితం బీ-2 బాంబర్ విమానాలతో నిర్వహించిన దాడుల వల్ల ఇరాన్ అణు సామర్థ్యానికి గణనీయమైన దెబ్బ తగిలిందని ఆయన పేర్కొన్నారు. ఆ చర్యతో అమెరికా తన లక్ష్యంలో విజయవంతమైందని వ్యాఖ్యానించారు.

అంతకుముందు ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో చర్చలు కోరుతూ, అదే సమయంలో అలాంటి చర్చలు లేవని బహిరంగంగా చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అలాగే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సొంతం చేసుకోదని పునరుద్ఘాటించారు. హోర్ముజ్ జలసంధిపై ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తి లొంగుబాటు జరిగే వరకు అమెరికాకు పూర్తి నియంత్రణ కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ ఖండించారు. అమెరికాతో ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా కొత్త సముద్ర మార్గంపై ఒమాన్‌తో కుదిరిన అవగాహన కేవలం నౌకల భద్రత కోసం రూపొందించిన సాంకేతిక ఏర్పాటే తప్ప, వ్యూహాత్మక జలమార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరిచినట్లుగా భావించరాదని వివరించారు.

ఇదిలా ఉండగా, అదే కార్యక్రమంలో అమెరికా సైనిక కుటుంబాలకు మరింత మద్దతు అందించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ మిలిటరీ స్పౌస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సైనికుల కుటుంబాల సంక్షేమాన్ని బలోపేతం చేయడమే ఈ కమిషన్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 9:04 am Digital Edition : Prabhanews
ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక |

Last Updated:Aug 04, 2026 6:44 AM ISTట్రంప్ ఇరాన్‌కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం.TRUMP (ANI)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్‌కు అనుకూల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. చర్చలు విఫలమైతే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ట్రంప్ స్పష్టం చేశారు.ANI తెలిపిన వివరాల ప్రకారం... మొదట అమెరికా ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక దాడికి సిద్ధమైందని, అయితే చివరి నిమిషంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతర్‌తో పాటు ఇరాన్ కూడా దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ఆ చర్యను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో దాడి జరిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని, అయితే పలు దేశాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని చర్చలకు మరో అవకాశం కల్పించామని చెప్పారు.ఇరాన్ అభ్యర్థన మేరకే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ మద్దతు ఇస్తున్నాయని, మరికొన్ని దేశాలు కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చాయని తెలిపారు. అనేక గంటలపాటు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఇరాన్ మాత్రం చర్చలు జరగడం లేదని బహిరంగంగా చెబుతోందని ఆయన ఆరోపించారు.అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమేనని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్వ ప్రభుత్వాలు, ఇతర దేశాలు విఫలమయ్యాయని, ఇప్పుడు దానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.ఇరాన్ అణు సామర్థ్యంపై అమెరికా గతంలో చేపట్టిన సైనిక చర్యలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఏడాదికిపైగా క్రితం బీ-2 బాంబర్ విమానాలతో నిర్వహించిన దాడుల వల్ల ఇరాన్ అణు సామర్థ్యానికి గణనీయమైన దెబ్బ తగిలిందని ఆయన పేర్కొన్నారు. ఆ చర్యతో అమెరికా తన లక్ష్యంలో విజయవంతమైందని వ్యాఖ్యానించారు.అంతకుముందు ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో చర్చలు కోరుతూ, అదే సమయంలో అలాంటి చర్చలు లేవని బహిరంగంగా చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. అలాగే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సొంతం చేసుకోదని పునరుద్ఘాటించారు. హోర్ముజ్ జలసంధిపై ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తి లొంగుబాటు జరిగే వరకు అమెరికాకు పూర్తి నియంత్రణ కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ ఖండించారు. అమెరికాతో ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా కొత్త సముద్ర మార్గంపై ఒమాన్‌తో కుదిరిన అవగాహన కేవలం నౌకల భద్రత కోసం రూపొందించిన సాంకేతిక ఏర్పాటే తప్ప, వ్యూహాత్మక జలమార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరిచినట్లుగా భావించరాదని వివరించారు.ఇదిలా ఉండగా, అదే కార్యక్రమంలో అమెరికా సైనిక కుటుంబాలకు మరింత మద్దతు అందించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ మిలిటరీ స్పౌస్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సైనికుల కుటుంబాల సంక్షేమాన్ని బలోపేతం చేయడమే ఈ కమిషన్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link