మంగళవారం జెఫరీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు మొత్తం వ్యాపారి చెల్లింపుల పరిమాణంలో కేవలం 4 శాతం మాత్రమే ఉన్నాయి. కానీ మొత్తం లావాదేవీల విలువలో వాటి వాటా దాదాపు 67 శాతంగా ఉంది. ఇలాంటి చర్య వల్ల పేమెంట్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయ అవకాశాలు ఏర్పడవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. దీని వల్ల పేటీఎం, పైన్ ల్యాబ్స్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలగవచ్చని తెలిపింది. ప్రస్తుతం యూపీఐ ద్వారా చేసే చెల్లింపులు వినియోగదారులకు, చిన్న వ్యాపారులకు ఉచితంగా కొనసాగుతున్నాయి. అయితే కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి వస్తే డిజిటల్ పేమెంట్ కంపెనీల ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు, యూపీఐ వ్యవస్థలో పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందా అనే విషయం కీలకంగా మారనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
