రోజువారీ అవసరాల కోసం, టీ, స్నాక్స్ లాంటి చిన్న మొత్తాల కొనుగోళ్లకు యూపీఐ వినియోగం భారీగా పెరగడంతో, 2022 తర్వాత యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ గణనీయంగా తగ్గింది. ఇది డిజిటల్ చెల్లింపుల్లో వస్తున్న మార్పును స్పష్టంగా చూపిస్తోంది. గత 4 ఏళ్లలో యూపీఐ సగటు ట్రాన్సాక్షన్ విలువ 30 శాతం తగ్గింది. 2022 జనవరిలో రూ.1,804గా ఉన్న సగటు విలువ, 2026 జూన్ నాటికి రూ.1,273కి పడిపోయింది. మైక్రో పేమెంట్లు, చిన్న వ్యాపారుల వద్ద పెరిగిన యూపీఐ వినియోగమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. (ప్రతీకాత్మక చిత్రం)

