ఇప్పటికే ఎంతమంది UPSను ఎంచుకున్నారు?
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2026 జూలై 19 నాటికి మొత్తం 1,18,195 మంది UPSను ఎంచుకున్నారు. వీరిలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు, అలాగే మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. UPSకు మారేందుకు ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువును ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు 2025 నవంబర్ 30 వరకు పొడిగించింది. దీంతో మరింత మంది ఉద్యోగులకు ఈ అవకాశాన్ని వినియోగించుకునే వీలు కలిగింది.

