ప్రభన్యూస్

Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం! | తెలంగాణ వార్తలు


Last Updated:

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ నూతన ఆరోగ్య పథకానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంలో శ్రీకారం చుట్టనున్నారు.

తెలంగాణ హెల్త్ స్కీమ్
తెలంగాణ హెల్త్ స్కీమ్

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంయుక్తంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా నేడు ప్రారంభం కాబోతోంది.

నూతన పోర్టల్ ఆవిష్కరణ.. హెల్త్ కార్డుల పంపిణీ

ఈ పథకం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) వెబ్ పోర్టల్‌ను మంత్రులు ఆవిష్కరించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రారంభం రోజునే ట్రస్ట్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులకు కొత్త డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసి పంపిణీ చేయనున్నట్లు ఉద్యోగుల జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.

360 ఆసుపత్రులతో ఒప్పందాలు.. సీజీహెచ్ఎస్ రేట్లతో చికిత్స

ఉద్యోగులకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 ప్రముఖ ఆసుపత్రులతో ఈ పథకం కింద ఒప్పందాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఈ పథకంలో అందించే వైద్య చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (CGHS) రేట్లను వర్తింపజేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు నగదు రహిత (Cashless) వైద్యం మరింత సులభతరం కానుంది.

జీతం నుంచి 1.5 శాతం చందా

ఈ పథకం నిర్వహణ కోసం ఉద్యోగుల భాగస్వామ్యాన్ని కూడా చేర్చారు. పథకంలో భాగంగా ప్రతి ఉద్యోగి నుంచి వారి మూల వేతనంలో (Basic Pay) 1.5 శాతం మొత్తాన్ని ప్రతి నెలా చందా రూపంలో వసూలు చేస్తారు. ఉద్యోగి ఎంత చందా అయితే చెల్లిస్తారో, దానికి సమానమైన (అంతే) మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ నిధికి జమ చేస్తుంది.

ఈ నూతన ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ద్వారా పథకం అమలుకు తుది అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 8:28 am Digital Edition : Prabhanews
Telangana: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 17, 2026 7:47 AM ISTTelangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 'ఉద్యోగుల ఆరోగ్య పథకం' (EHS) ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఈ నూతన ఆరోగ్య పథకానికి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంలో శ్రీకారం చుట్టనున్నారు.తెలంగాణ హెల్త్ స్కీమ్ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంయుక్తంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా నేడు ప్రారంభం కాబోతోంది.నూతన పోర్టల్ ఆవిష్కరణ.. హెల్త్ కార్డుల పంపిణీఈ పథకం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) వెబ్ పోర్టల్‌ను మంత్రులు ఆవిష్కరించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రారంభం రోజునే ట్రస్ట్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులకు కొత్త డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసి పంపిణీ చేయనున్నట్లు ఉద్యోగుల జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.360 ఆసుపత్రులతో ఒప్పందాలు.. సీజీహెచ్ఎస్ రేట్లతో చికిత్సఉద్యోగులకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 ప్రముఖ ఆసుపత్రులతో ఈ పథకం కింద ఒప్పందాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఈ పథకంలో అందించే వైద్య చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (CGHS) రేట్లను వర్తింపజేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు నగదు రహిత (Cashless) వైద్యం మరింత సులభతరం కానుంది.జీతం నుంచి 1.5 శాతం చందాఈ పథకం నిర్వహణ కోసం ఉద్యోగుల భాగస్వామ్యాన్ని కూడా చేర్చారు. పథకంలో భాగంగా ప్రతి ఉద్యోగి నుంచి వారి మూల వేతనంలో (Basic Pay) 1.5 శాతం మొత్తాన్ని ప్రతి నెలా చందా రూపంలో వసూలు చేస్తారు. ఉద్యోగి ఎంత చందా అయితే చెల్లిస్తారో, దానికి సమానమైన (అంతే) మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ నిధికి జమ చేస్తుంది.ఈ నూతన 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' (EHCT) ద్వారా పథకం అమలుకు తుది అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link