ప్రభన్యూస్

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు.. భగ్గుమన్న అక్కడి ప్రభుత్వం, క్రికెటర్ ఇంటికి నిప్పు |


Last Updated:

Sheikh Hasina: అందరూ అనుకున్నదే జరిగింది. షేక్ హసీనా.. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అక్కడి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. మరి ఆమె డిసెంబర్‌లో ఆ దేశానికి వెళ్తే ఏమవుతుంది? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు (Image - ANI)
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు (Image – ANI)

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం తర్వాత ఢాకా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 5న జరిగిన ఈ సమావేశంలో హసీనా డిసెంబర్‌లో స్వదేశం తిరిగి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను దేశ సార్వభౌమత్వానికి అవమానంగా అభివర్ణించింది.

ANI రిపోర్టు ప్రకారం, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగస్టు 5న విడుదల చేసిన ప్రకటనలో “పారిపోయిన, దోషిగా నిర్ధారించిన జెనోసైడర్ షేక్ హసీనాను.. న్యూఢిల్లీలో మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అనుమతించటం బంగ్లాదేశ్‌కు ఆగ్రహం కలిగించింది” అని తెలిపింది. ఆమె, ఆమె అనుచరులు బంగ్లాదేశ్ దేశం, ప్రజలపై “విషపూరిత విమర్శలు” చేశారని ఆరోపించింది. జులై విప్లవం రెండో వార్షికోత్సవం రోజున భారత భూమిపై ఈ సమావేశం జరగడం దేశ సార్వభౌమత్వానికి అవమానం, జులై విప్లవ అమరవీరులకు తీవ్ర అవమానమని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: Rain Weather: బలంగా ద్రోణి.. 6 రోజులు వర్షాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక అలర్ట్!

ఈ కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని భారత ప్రభుత్వానికి ముందుగానే ఢాకా తెలిపినా, దాన్ని అనుమతించడం బాధాకరమని మంత్రిత్వ శాఖ చెప్పింది. 2013లో సంతకం చేసిన భారత-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం కింద హసీనాను తిరిగి పంపాలని పదే పదే అభ్యర్థించినా స్పందన రాలేదని కూడా విమర్శించింది. ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన వాస్తవాలైన.. 2024 జులై-ఆగస్టు సమయంలో అమాయక పౌరులు, పిల్లలను చంపేశారనే వాస్తవాల్ని హసీనా తిరస్కరించడం చరిత్రను తిప్పికొట్టే వ్యర్థ ప్రయత్నమని అన్నారు.

ఇండియా టుడే, ది వైర్ వంటి మీడియా నివేదికల ప్రకారం, హసీనా ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహించిన ప్రైవేట్ కార్యక్రమంలో ఆడియో లింక్ ద్వారా మాట్లాడారు. ఆమె “నన్ను అరెస్టు చేయవచ్చు, జైలుకు పంపవచ్చు, చంపవచ్చు కూడా. కానీ భయం నా విధిని నిర్ణయించదు. డిసెంబర్‌లో నా ప్రజల దగ్గరకు తిరిగి వస్తాను” అని చెప్పారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించినదనీ, ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదనీ, ఆమె అభిప్రాయాలను ఆమోదించడం లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: Hiroshima Day: అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది? దాని వెనక దాగివున్న చరిత్రేంటి?

ఇదే సమయంలో మరో సంచలనాత్మక సంఘటన జరిగింది. హసీనా మీడియా సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ఆవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి జరిగింది. News18 రిపోర్టు ప్రకారం, ఆగస్టు 5 సాయంత్రం 9 గంటల సమయంలో మగురా జిల్లాలోని కేశబ్ మోర్ ప్రాంతంలోని ఆయన ఇంటి దగ్గరకు బైకులపై వచ్చిన వ్యక్తులు.. పెట్రోల్ బాంబ్ లాంటి వస్తువును విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పొరుగువారు వెంటనే నిప్పును ఆర్పేశారు. పెద్ద నష్టం జరగలేదు.

మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అబ్దుల్లా అల్ మామున్ ది డైలీ స్టార్‌కి చెప్పినట్లు, “కొందరు దుండగులు ఇంటిపై ఇటుకలు, రాళ్లు విసిరి కిటికీలు పగలగొట్టారు. ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు.” ఇంట్లో ఎవరూ లేరు. పోలీసులు విచారణ ప్రారంభించారు, భద్రతా సిబ్బందిని మోహరించారు. షకీబ్ గతంలో మగురా-1 నియోజకవర్గం నుంచి ఆవామీ లీగ్ ఎంపీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Tobacco Money: ఆ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ, వడ్డీలేని రుణాలు

ఈ రెండు సంఘటనలూ బంగ్లాదేశ్ రాజకీయ ఉద్రిక్తతలను మరోసారి ఎత్తి చూపుతున్నాయి. 2024 జూలై-ఆగస్టు విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోయి, ఆమె భారత్‌కు పారిపోయారు. ప్రస్తుత ఢాకా ప్రభుత్వం ఆమెను “దోషిగా నిర్ధారించిన వ్యక్తి”గా పరిగణిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు సానుకూల దిశగా కదులుతున్న సమయంలో ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని ఢాకా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిపై పోలీసు విచారణ, దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 6:55 am Digital Edition : Prabhanews
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు.. భగ్గుమన్న అక్కడి ప్రభుత్వం, క్రికెటర్ ఇంటికి నిప్పు |

Last Updated:Aug 06, 2026 6:48 AM ISTSheikh Hasina: అందరూ అనుకున్నదే జరిగింది. షేక్ హసీనా.. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అక్కడి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. మరి ఆమె డిసెంబర్‌లో ఆ దేశానికి వెళ్తే ఏమవుతుంది? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు (Image - ANI)బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం తర్వాత ఢాకా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 5న జరిగిన ఈ సమావేశంలో హసీనా డిసెంబర్‌లో స్వదేశం తిరిగి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనను దేశ సార్వభౌమత్వానికి అవమానంగా అభివర్ణించింది.ANI రిపోర్టు ప్రకారం, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగస్టు 5న విడుదల చేసిన ప్రకటనలో “పారిపోయిన, దోషిగా నిర్ధారించిన జెనోసైడర్ షేక్ హసీనాను.. న్యూఢిల్లీలో మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అనుమతించటం బంగ్లాదేశ్‌కు ఆగ్రహం కలిగించింది” అని తెలిపింది. ఆమె, ఆమె అనుచరులు బంగ్లాదేశ్ దేశం, ప్రజలపై “విషపూరిత విమర్శలు” చేశారని ఆరోపించింది. జులై విప్లవం రెండో వార్షికోత్సవం రోజున భారత భూమిపై ఈ సమావేశం జరగడం దేశ సార్వభౌమత్వానికి అవమానం, జులై విప్లవ అమరవీరులకు తీవ్ర అవమానమని స్పష్టం చేసింది.ఇవి కూడా చదవండి: Rain Weather: బలంగా ద్రోణి.. 6 రోజులు వర్షాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక అలర్ట్!ఈ కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని భారత ప్రభుత్వానికి ముందుగానే ఢాకా తెలిపినా, దాన్ని అనుమతించడం బాధాకరమని మంత్రిత్వ శాఖ చెప్పింది. 2013లో సంతకం చేసిన భారత-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం కింద హసీనాను తిరిగి పంపాలని పదే పదే అభ్యర్థించినా స్పందన రాలేదని కూడా విమర్శించింది. ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన వాస్తవాలైన.. 2024 జులై-ఆగస్టు సమయంలో అమాయక పౌరులు, పిల్లలను చంపేశారనే వాస్తవాల్ని హసీనా తిరస్కరించడం చరిత్రను తిప్పికొట్టే వ్యర్థ ప్రయత్నమని అన్నారు.ఇండియా టుడే, ది వైర్ వంటి మీడియా నివేదికల ప్రకారం, హసీనా ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహించిన ప్రైవేట్ కార్యక్రమంలో ఆడియో లింక్ ద్వారా మాట్లాడారు. ఆమె “నన్ను అరెస్టు చేయవచ్చు, జైలుకు పంపవచ్చు, చంపవచ్చు కూడా. కానీ భయం నా విధిని నిర్ణయించదు. డిసెంబర్‌లో నా ప్రజల దగ్గరకు తిరిగి వస్తాను” అని చెప్పారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించినదనీ, ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదనీ, ఆమె అభిప్రాయాలను ఆమోదించడం లేదని స్పష్టం చేసింది.ఇవి కూడా చదవండి: Hiroshima Day: అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది? దాని వెనక దాగివున్న చరిత్రేంటి?ఇదే సమయంలో మరో సంచలనాత్మక సంఘటన జరిగింది. హసీనా మీడియా సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ ఆవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దాడి జరిగింది. News18 రిపోర్టు ప్రకారం, ఆగస్టు 5 సాయంత్రం 9 గంటల సమయంలో మగురా జిల్లాలోని కేశబ్ మోర్ ప్రాంతంలోని ఆయన ఇంటి దగ్గరకు బైకులపై వచ్చిన వ్యక్తులు.. పెట్రోల్ బాంబ్ లాంటి వస్తువును విసిరి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పొరుగువారు వెంటనే నిప్పును ఆర్పేశారు. పెద్ద నష్టం జరగలేదు.మగురా సదర్ పోలీస్ స్టేషన్ అధికారి అబ్దుల్లా అల్ మామున్ ది డైలీ స్టార్‌కి చెప్పినట్లు, “కొందరు దుండగులు ఇంటిపై ఇటుకలు, రాళ్లు విసిరి కిటికీలు పగలగొట్టారు. ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు.” ఇంట్లో ఎవరూ లేరు. పోలీసులు విచారణ ప్రారంభించారు, భద్రతా సిబ్బందిని మోహరించారు. షకీబ్ గతంలో మగురా-1 నియోజకవర్గం నుంచి ఆవామీ లీగ్ ఎంపీగా ఉన్నారు.ఇవి కూడా చదవండి: Tobacco Money: ఆ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆర్థిక సాయం పంపిణీ, వడ్డీలేని రుణాలుఈ రెండు సంఘటనలూ బంగ్లాదేశ్ రాజకీయ ఉద్రిక్తతలను మరోసారి ఎత్తి చూపుతున్నాయి. 2024 జూలై-ఆగస్టు విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోయి, ఆమె భారత్‌కు పారిపోయారు. ప్రస్తుత ఢాకా ప్రభుత్వం ఆమెను “దోషిగా నిర్ధారించిన వ్యక్తి”గా పరిగణిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు సానుకూల దిశగా కదులుతున్న సమయంలో ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని ఢాకా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితిపై పోలీసు విచారణ, దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link