Last Updated:
Scam Alert | సైబర్ నేరగాళ్లు వాట్సప్ ఖాతాలను హ్యాక్ చేయడానికి కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అకౌంట్ స్టేట్మెంట్ల పేరుతో హానికరమైన ఫైళ్లను పంపిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
వ్యాపారులు, ప్రొఫెషనల్స్కు చెందిన వాట్సప్ ఖాతాలను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అకౌంట్ స్టేట్మెంట్లు, రెగ్యులేటరీ నోటీసుల పేరుతో హానికరమైన ఫైళ్లను పంపించి వాట్సప్ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ తరహా ఫిర్యాదులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో భారీగా పెరిగినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం మంత్రిత్వ శాఖ (MHA) గుర్తించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఒకే తరహా మోసాలు నమోదయ్యాయి. ఈ కొత్త ముప్పు గురించి I4C ఇప్పటికే 22 జూన్ 2026న “రెగ్యులేటరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంపర్సనేషన్ ఫర్ వాట్సప్ అకౌంట్ టేకోవర్ యూజింగ్ మాలిషియస్ విండోస్ ఎగ్జిక్యూటబుల్స్ అండ్ హై వాల్యూ ఫైనాన్షియల్ ఫ్రాడ్” పేరుతో అడ్వైజరీ జారీ చేసింది.

