మీకు కావాల్సిన రైలును ఎంచుకున్న తర్వాత స్లీపర్, 3ఏసీ, 2ఏసీ వంటి క్లాస్ను సెలెక్ట్ చేసి ‘బుక్ నౌ’పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రయాణికుల వివరాలు నమోదు చేయాలి. ఇందులో ప్రతి ప్రయాణికుడి పూర్తి పేరు, వయసు, లింగం వంటి వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్తో పాటు అడిగిన ఇతర వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. పేరు, వయసు లేదా ఇతర వివరాల్లో చిన్న తప్పు ఉన్నా తర్వాత టికెట్ క్యాన్సిల్ లేదా రీఫండ్ సమయంలో ఇబ్బందులు రావచ్చు. పేమెంట్ చేసే ముందు టికెట్ వివరాలను మరోసారి పూర్తిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణ తేదీ, రైలు పేరు, రైలు నంబర్, ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్, క్లాస్, ప్రయాణికుల వివరాలు సరిగ్గా ఉన్నాయో చూడాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి. పేమెంట్ విజయవంతమైన తర్వాత టికెట్ బుక్ అవుతుంది. వచ్చిన పీఎన్ఆర్ నంబర్ను సేవ్ చేసుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
