Last Updated:
IPO: భారత ప్రైమరీ మార్కెట్ మరోసారి పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడనుంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్స్టోన్ మద్దతు ఉన్న హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్తో సహా మొత్తం ఆరు కంపెనీలు వచ్చే వారం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ – IPO) ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ. 5,600 కోట్లను సమీకరించేందుకు సిద్ధమయ్యాయి.
గడచిన వారంలో ఐదు కంపెనీలు ఐపీఓలను ప్రారంభించగా, ఈ నెల ప్రారంభంలో మరో మూడు కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈ వరుస పబ్లిక్ ఇష్యూలతో 2026 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య ఏకంగా 54కి చేరనుంది. వచ్చే వారం ఐపీఓల సందడి ఆగస్టు 17న ప్రారంభం కానుంది. మొదటి రోజే రెండు ప్రముఖ సంస్థలు తమ ఇష్యూలను తీసుకువస్తున్నాయి. వీటిలో హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ రూ. 2,600 కోట్ల విలువైన ఐపీఓతో బిడ్డింగ్ను ప్రారంభించనుండగా, అదే రోజు ప్రముఖ రిటైల్ ఆభరణాల సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్ రూ. 1,700 కోట్ల పబ్లిక్ ఇష్యూ మార్కెట్లోకి రానుంది.

