ఈ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా జోనల్ రైల్వేలు నీటి వనరులు, నీటి శుద్ధి, వడపోత ప్లాంట్లు, భూగర్భ ట్యాంకులు, ఓవర్హెడ్ ట్యాంకులు, పీవీసీ ట్యాంకులు, వాటర్ బూత్లు, కుళాయిలు, నీటి సరఫరా కేంద్రాలను సమగ్రంగా పరిశీలించనున్నాయి. తాగునీటి ట్యాంకులను పూర్తిగా ఖాళీ చేసి, అందులో పేరుకుపోయిన బురద, మురికిని తొలగించి, ట్యాంకులను శుభ్రపరిచి క్రిమిసంహారక చర్యలు చేపడతారు. అంతేకాకుండా ట్యాంకుల్లోకి పక్షులు, జంతువులు ప్రవేశించకుండా, నాచు లేదా ఇతర మలినాలు చేరకుండా వెంట్లు, ఓవర్ఫ్లో పాయింట్లకు పటిష్టమైన మూతలు, రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నీరు నిల్వ చేసే దశలోనే కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
