Last Updated:
150 ఏళ్ల చరిత్ర ఉన్న ‘వందేమాతరం’కు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కీలక స్థానం దక్కనుంది. ఎర్రకోట వేదికపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ఈ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. అయితే ఇన్నేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ‘వందేమాతరం’ ఎందుకు కనిపించలేదు? అసలు కారణమేంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
2026 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’కు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం దక్కనుంది. ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించడానికి ముందు ‘వందే మాతరం’ను ఆలపించనున్నారు. 2026లో ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దశాబ్దాలుగా జాతీయ గీతంగా గౌరవం పొందుతున్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో పరిమిత పాత్రకే పరిమితమైన ‘వందే మాతరం’కు ఈసారి ప్రధాన వేడుకలో స్థానం లభించనుంది.

