పండుగల సీజన్లో రైళ్లకు పెరగనున్న రద్దీని తగ్గించేందుకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కలిపే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక రైలు సర్వీసులు 2026 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నడుస్తాయి. కొన్ని మార్గాల్లో అదనపు ట్రిప్పులు కూడా ఉంటాయి. ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

