సమ్మె ప్రధానంగా ఫిజికల్ బ్యాంక్ శాఖల సేవలపై ప్రభావం చూపుతుంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ ఉద్యోగులు స్వయంగా ప్రాసెస్ చేయాల్సిన పనుల్లో ఆలస్యం జరగొచ్చు. చెక్కులకు సంబంధించిన పనులు, కేవైసీ అప్డేట్లు, డాక్యుమెంట్లు సమర్పించడం, ఖాతాకు సంబంధించిన అభ్యర్థనలు, ఇతర బ్రాంచ్ ఆధారిత సేవలు ఆలస్యం కావచ్చు. అందువల్ల డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, నగదు తీసుకోవడం వంటి పనులకు ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

