Last Updated:
15 ఏళ్లుగా Appleను నడిపించిన టిమ్ కుక్ ఇక CEO కాదు.. కొత్త బాస్ వచ్చాడు. అయితే CEO మార్పుతో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఈ కథనంలో….
టెక్ దిగ్గజం యాపిల్లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థకు సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన టిమ్ కుక్ స్థానంలో జాన్ టర్నస్ బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి టర్నస్ యాపిల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు ప్రారంభించారు. సీఈఓ మార్పుతో పాటు ఇద్దరు కీలక అధికారుల వేతన ప్యాకేజీల్లోనూ గణనీయమైన తేడా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జాన్ టర్నస్ అందుకోబోయే ప్యాకేజీ టిమ్ కుక్ కంటే ఎక్కువగా ఉండనుంది. వీరిద్దరి ప్యాకేజీల మధ్య సుమారు రూ.8.6 కోట్ల వ్యత్యాసం ఉంటుందని సమాచారం.

