Last Updated:
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వందేళ్ల నాటి హిందూ ఆలయాన్ని మతోన్మాదులు కూల్చివేయడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీల రక్షణలో పాక్ పూర్తిగా విఫలమైందని మండిపడుతూ, వెంటనే ఆలయాన్ని పునర్మించాలని డిమాండ్ చేసింది.
పాకిస్థాన్లో మైనార్టీలు, వారి ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడుల పట్ల భారతదేశం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని నరోవాల్ జిల్లా పరిధిలో ఉన్న సిరాజ్ గ్రామంలో సుమారు వందేళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు నేలమట్టం చేయడాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఇదొక అత్యంత క్రూరమైన చర్య అని, మైనార్టీల ప్రార్థనా మందిరాల రక్షణలో అక్కడి అధికారుల నిర్లక్ష్యానికి, వైఫల్యానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.

