జూన్లో భారత మార్కెట్లో విడుదలైన రెడ్మీ టర్బో 5 ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్తో అందుబాటులోకి వచ్చింది. షావోమీ సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన తొలి టర్బో సిరీస్ ఫోన్గా ఇది గుర్తింపు పొందింది. శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్, అధునాతన కెమెరా ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చారు. రెడ్మీ టర్బో 5 బేస్ వేరియంట్లో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. దీని ఎంఆర్పీ రూ.54,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.57,999. ఆగస్టు 7న ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో బ్యాంక్ ఆఫర్లతో బేస్ వేరియంట్ను రూ.35,999కే కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ టర్బో 5 ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. (image: Xiaomi India)

