Last Updated:
Air India: థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్బస్ ఏ320 (Airbus A320) విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది.
Air India: థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్బస్ ఏ320 (Airbus A320) విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది.36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానానికి సంబంధించిన మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు దాదాపు ఒకేసారి పనిచేయడం ఆగిపోయాయి. దీనివల్ల విమానం ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు లోనై, 24 మంది తీవ్రంగా గాయపడ్డారని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది. మొదట్లో దీనిని తీవ్రమైన ఘటనగా పరిగణించినప్పటికీ, తర్వాత దర్యాప్తు అధికారులు దీనిని ప్రమాదం (Accident)గా వర్గీకరించారు.

