ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

