Last Updated:
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా రాయబారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ కీలక దౌత్య చర్చల నేపథ్యంలో రెండు దేశాల మధ్య దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ పోరును ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఉన్నత స్థాయి దౌత్య బృందం మాస్కో, కీవ్లలో పర్యటించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ శనివారం మాస్కోలో, ఆదివారం కీవ్లో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. ఈ రాయబార బృందం పర్యటన ప్రశాంతంగా సాగేందుకు వీలుగా రెండు దేశాలు వైమానిక దాడులను ఆపాలని జెలెన్స్కీ కోరారు.

