Last Updated:
Delhi Swine Flu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఢిల్లీలో ఏకంగా 1777కు పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి అక్కడ కేవలం 229 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. అంటే, పోయిన ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం కేసులు దాదాపు 8 రెట్లు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

