Last Updated:
తెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సందర్శించారు. ఈ క్రమంలో పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ బోధించే ప్రొఫెసర్ మాయా ట్యూడర్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ మాయాను ముఖ్యమంత్రి కలవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

